|
పొగ త్రాగే వారి జేబులు ఖాళీ |
|
|
బహిరంగంగా దమ్ము కొడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టే వారిపై ఇకపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి వారిపై జరిమానా విధించే అదికారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, రైల్వే స్టేషన్ మాస్టర్లు, పోస్ట్మెన్ లకు కల్పిస్తుంది.
మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబర్ 2నుండి ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ఆరోగ్య శాఖ కృత నిశ్చయంతో ఉంది. బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని కార్యాలయ భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, బాస్ స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లును కూడా ఈ జాబితాలో చేర్చారు. వీటి ప్రాంగణంలో ఎక్కడా పొగ పీల్చడానికి లేదు. పొగ తాగుతూ చిక్కిన వారు దగ్గరి నుంచి రూ. 200జరిమానా విధిస్తారు. రూ.200 జరిమానా చాలా తక్కువని ఈ మొత్తాన్ని రూ. 2వేల వరుకూ పెంచాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. |