|
సానియాకు టెన్నిస్ సంఘం చురక |
|
|
స్వదేశంలో జరిగే టోర్నీల నుండి టెన్నిస్ క్రీడాకారులు తప్పుకోవడాన్ని భారత టెన్నిస్ సంఘం (ఏఐటిఏ) తప్పుబట్టింది. అధిక సొమ్ము కోసం దేశంలో జరిగే టోర్నీల నుండి తప్పుకుంటున్నారని ఏఐటిఏ అనిల్ ఖన్నా అన్నారు. మా టోర్నమెంట్ వ్యవస్థను ఆసరా చేసుకుని...
క్రీడాకారులు పెద్ద వాళ్ళయ్యారన్న సంగతి మర్చిపోకూడదని అన్నారు. వివాదం కారణంగా బెంగుళూరు ఓపెన్ నుడి సానియా తప్పుకోవడాన్ని అనిల్ ఖన్నా ప్రస్తావిస్తూ 25వేల డాలర్లు అందుకునే వ్యక్తి హఠాత్తుగా లక్ష డాలర్లు కావాలని అంటే ఎలా అని ప్రశ్నించారు. భారత్లో జరిగే టోర్నీల విషయంలోనే వ్యాపారాత్మకంగా ఎందుకు ఆలోచిస్తారో అని చెప్పారు. |