ఇటీవలే హోమం చిత్రం సృష్టించి మంచి విజయాన్ని విజయం సాధించిన జె.డి.చక్రవర్తి ఈ సారి 'మారణహోమం' సృష్టించేందుకు సిద్దమవుతున్నారు. 'హోమం'కి సీక్వెల్గా 'మారణహోమం'ని రూపొందించనున్నట్లు జె.డి తెలిపారు. అక్టోబర్ 9నుండి ఈ చిత్ర షూటింగ్...
ప్రారంభం కానుంది. ఇందులో కూడా జగపతిబాబు కథానాయకుడిగా నటిస్తారు. అంతర్జాతీయ ఉగ్రవాదం నేపధ్యంలో 'మారణహోమం' కథ ఉంటుందన్నారు. ఈ నెల 16నుండి 'హోమం జాతర' పేరుతో విజయ యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. త్వరలో హోమం కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు "మారణహోమం"లో నటించే అవకాశం ఇవ్వనున్నామన్నారు. |