|
చిరుకు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ |
|
|
చిరంజీవి స్థాపించిన "రాజారాజ్యం" పార్టీ తరుపున సమాజ్వాదీ పార్టీ నాయకులు అమర్సింగ్, జయప్రద, జయాబచ్చన్లు ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 7న సాయంత్రం గంటలకు హైదరాబాద్ "ప్రజారాజ్యం" పార్టీ ఆఫీసులో చిరంజీవిని కలిసి కార్యాచరణ...
రూపొందిస్తామని సమాజ్వాదీ పార్టీ నాయకులు అమర్సింగ్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే తాము చిరంజీవికి మద్దతిస్తున్నట్లు తెలియచేశారు. చిరుకి సన్నిహితుడైన అమితాబ్ బచ్చన్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అమర్సింగ్ వివరించారు. తాము ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. |