|
కేసు ఉపసంహరించుకున్న జర్మనీ మహిళ |
|
|
తన టీనేజీ కుమార్తె పై అత్యాచారానికి పాల్పడ్దాడంటూ గోవా విద్యామంత్రి కుమారుడు రోహిత్ పై...
పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్మనీ మహిళ తన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కేసు విచారణ నత్త నడక నడుస్తుండడం పట్ల విసిగిపోయిన ఆ మహిళ తను తన కేసును ఉపసంహరించుకోదలిచాలని పోలీసులకు తెలియజేశారు. ఆమె ఈ మేరకు కాళంగుటే పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. ఆ మహిళ తరపు న్యాయవాది ఏర్స్ రోడ్రిగ్స్ ఈ సంగతి తెలిపారు. విద్యామంత్రి మాన్ సెరాట్ కుమారుడు రోహిత్ అక్టోబర్ 2న తన కుమార్తె పై అత్యాచారం జరిపినట్లు అక్టోబర్ 14న కేసు పెట్టారు. |