శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఉగ్ర శ్రీనివాసుడికి వైభవోపేతంగా...
అలంకరణ చేశారు. ఆలయంలో పూజలందుకున్న శ్రీనివాసుడు వేకువ జామున ఉభయ దేవేరులతో ఉదయం సూర్యోదయానికి మునుపే మాడా వీధులలో విహరిస్తూ భక్త జనులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉగ్ర శ్రీనివాసునికి సూర్యకిరణాలు సోకితో ఉగ్రత్వం వస్తుందని ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. ఏడాదికి ఒక పర్యాయం మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామికి నిత్యం నిర్వహించే అర్చనానంతర సేవా టిక్కెట్లను రద్దు చేశారు.
|