అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అనంతరం ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులతో మాట్లాడిన బరాక్ ఒబామా మన ప్రధానితో ...
మాట్లాడకపోవటం పలు విమర్శలకు దారితీసింది.అదేం లేదని ప్రధాని సర్దిచెప్పినా సందేహాలు తీరలేదు. ఎట్టకేలకు వీటికి ఈరోజు తెరపడింది. ఈరోజు ఉదయం ఒబామా ప్రధాని మన్మోహన్సింగ్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాల నేతలు కొద్దిసేపు చర్చ జరిపినట్లు ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బరాక్ ఒబామాను భారత్కు రమ్మని మన్మోహన్ ఆహ్వానించగా, వచ్చే జనవరిలో తప్పక భారత్ వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
|