|
సాక్షుల రక్షణలొ హోం శాఖ విఫలం |
|
|
|
Page 1 of 2  పెనుగొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి తీవ్ర సంచలనాన్ని అనుమానాలను...
రెక్కెతించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడురవి హత్య కేసులో ప్రధాన నిందుతుడైన జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దు శ్రీను హత్య కూడా అదే స్థాయిలో సంచలనం కలిగిస్తుంది. పరిటాల హత్య కేసు తుది విచారణకు చేరడంతో మొద్దు శ్రీను హత్య జరగటం రాష్ట్ర ప్రభుత్వం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్దెలచెరువు సూరి కోసమే పరిటాల రవిని హతమార్చానని చెప్పిన మొద్దు శ్రీను, తరువాత తన గళం మార్చాడు. అప్రూవర్ గా మారిన మొద్దు శ్రీను పరిటాల రవి హత్యకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, రవి హత్య వెనుక సూత్రధరులు ఎవరో బయట పెడతానని మాట్లాడటం బట్టి, పరిటాల రవి హత్య వెనుక ఉన్న ముఖ్యులు ముందు జాగ్రత్తగా మొద్దు శ్రీను హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సూరి వల్ల తనకు ప్రాణ హాని ఉందని శ్రీను అధికారులతో ఎన్ని సార్లు చెప్పిన లాభం లేకుండా పోయింది. నిజాలు బయటకు వస్తాయని జైల్లో ఉన్న వ్యక్తిని హత్య చేస్తే, బయట ఉన్న సామాన్యుని పరిస్థితీ ఏమిటి? అనే ప్రశ్న సామాన్య ప్రజలకు ప్రశ్న గానే మిగిలింది. |