మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్థాకరే ఈరోజు మరో వివాదానికి ఆజ్యం పోశారు. జూన్ 14న తన పుట్టినరోజున...
కేకును కట్ చేసిన వీడియోను సమాజ్వాదీ పార్టీ నేత కిశోర్ సామ్రాట్ ఈరోజు విడుదల చేశారు. 'భయ్యా' అని రాసిన ఉన్న కేకును రాజ్థాకరే కోసిన చిత్రాలు ఈ వీడియో టేపులో ఉన్నాయి. ముంబైలో ఉంటున్న ఉత్తర భారతీయులపై పరోక్ష యుద్ధం చేస్తున్న రాజ్థాకరే భయ్యా అనే కేకును కోసేయడం వారిపై ఉన్న కోపాన్ని, కసిని తెలుపుతోందని సమాజ్వాదీ నేత పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను పూర్తిగా వెళ్లగొట్టేవరకు రాజ్ విశ్రమించబోరనే అర్థాలు ఈ వీడియో వెల్లడిస్తోందని అన్నారు.
|