జమ్మూకాశ్మీర్లోని జీలం నదిపై ఓ వంతెన కూలిపోవడంతో 25మంది కూలీలు మృతిచెందారు. ఆదివారం శ్రీనగర్కు 90 కిలోమీటర్ల...
దూరంలోని యూరి పట్టణం వద్దనున్న జీలం నదిపై కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు తుదిమెరుగులు దిద్దుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో చాలా మృతదేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 130 మీటర్ల పొడవున్న ఆ వంతెన వచ్చేవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు శనివారం అధికారులు వంతెనపై ఇసుక బస్తాలు ఉంచారు. ఆదివారం వాటిని కూలీలు తొలగిస్తున్న సమయంలో స్టీలుతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. |